అవినాశ్ రెడ్డికి..సుప్రీం నోటీసులు

అవినాశ్ రెడ్డికి..సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ, వెలుగు : మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మే 31న తెలంగాణ హైకోర్టు అవినాశ్ రెడ్డికి మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ఆదేశాలను సవాల్ చేస్తూ వివేకా కూతురు సునీత సుప్రీంను ఆశ్రయించారు. ఈ పిటిషన్​ను జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ ఎం.ఎం సుదరేశ్ లతో కూడిన వెకేషన్ బెంచ్ సోమవారం విచారించింది. సునీత తరఫు లాయర్ సిద్ధార్థ లూత్రా వాదిస్తూ.. ఈ కేసులో అవినాశ్ రెడ్డి ప్రధాన కుట్రదారుడని, అరెస్టు కాకుండా అతను అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. సునీత పిటిషన్ పై సమాధానం ఇవ్వాలని అవినాశ్ రెడ్డికి, సీబీఐకి నోటీసులు ఇచ్చింది.