ఇండియన్స్ రోజూ తినే ఆహారం ఏదైనా కానీ... కార్బోహైడ్రేట్స్ తప్పనిసరిగా ఉంటుంది. సోర్స్ ఏదైనా కానీ కార్బోహైడ్రేట్స్ కామన్ గా ఉంటాయి. ఈమధ్య కాలంలో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం మంచిది కాదని.. పూర్తిగా మానేస్తున్నారు చాలామంది. ఇలా మానేయడం కరెక్ట్ కాదని అంటున్నారు డాక్టర్స్. కార్బోహైడ్రేట్స్ లో మన ఆరోగ్యానికి మంచి చేసేవి కూడా ఉన్నాయని.. వాటిలో పోషకాలను బట్టి సెలెక్ట్ చేసుకోవాలని అంటున్నారు.
మనం ఏక్కువగా తీసుకునే దోశ పిండి, సగ్గుబియ్యం, సూజీ , తెల్ల బియ్యం, బ్రౌన్ రైస్, గోధుమ పిండి, చిరుధాన్యాల వరకు, ఒక రేటింగ్ ఇచ్చి, రోజువారీ ఆహారంలో భాగంగా ఏది ఎక్కువ తీసుకోవాలో, తక్కువ తీసుకోవాలో సూచిస్తున్నారు. అలాగే, తీసుకునే ఆహార పరిమాణం, కార్బోహైడ్రేట్ మూలాన్ని దేనితో కలిపి తీసుకుంటున్నామనేది కూడా ముఖ్యమని అంటున్నారు.
దోశ పిండి:
బియ్యం, మినప పప్పు కలిసి కార్బోహైడ్రేట్లతో పాటు కొంత ప్రోటీన్ ను కూడా అందిస్తాయని.. అదే సమయంలో పులియబెట్టడం వల్ల జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుందని అంటున్నారు. పిండిలో ఒక గుడ్డును కూడా కలపడం వల్ల దానిలో ప్రోటీన్ శాతం పెరుగుతుందని సూచిస్తున్నారు. దోశలు ఎక్కువగా తీసుకున్నా కూడా కార్బోహైడ్రేట్స్ తో ఏ సమస్య ఉండదని అంటున్నారు.
సగ్గుబియ్యం:
సగ్గుబియ్యంలో ఎక్కువగా పిండిపదార్థం ఉంటుందని, పీచుపదార్థం, ప్రోటీన్ చాలా తక్కువగా ఉంటాయని అంటున్నారు.సగ్గుబియ్యాన్ని సాధారణంగా ఫాస్టింగ్ ఫుడ్ లాగా ఉపయోగిస్తారని... దీనిని ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్ అని చెప్పలేమంటున్నారు.
సూజీ:
సూజీ మైదా కంటే మంచిది, కానీ ఇది రిఫైన్డ్ కాబట్టి ఇందులో పీచుపదార్థం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. సూజీ ఆధారిత భోజనాన్ని మరింత ఆరోగ్యకరంగా మార్చడానికి, అందులో పుష్కలంగా కూరగాయలు, ప్రోటీన్ను చేర్చాలని సూచిస్తున్నారు.
►ALSO READ | సూపర్ బ్రేక్ ఫాస్ట్:వారానికి రెండు సార్లు..ఉక్కపోత ఉండదు..శరీరంలో వేడి తగ్గి హెల్దీగా ఉంటారు..!
ఇది వండటం సులభమని, రుచికరంగా ఉంటుందని, పిల్లలు సులభంగా జీర్ణం చేసుకోగలరని అంటున్నారు. ఇందులో పుష్కలంగా కూరగాయలు కలపడం వల్ల భోజనం మరింత మెరుగుపడుతుందని అంటున్నారు.
వైట్ రైస్
వైట్ రైస్ సులభంగా జీర్ణమవుతుందని, తగిన మోతాదులో తీసుకుంటే మంచిదని అంటున్నారు డాక్టర్స్. అన్నాన్ని పూర్తి భోజనంగా భావించకుండా, దానితో పాటు పప్పు, కూరగాయలు, పెరుగు, ఇతర ప్రోటీన్ పదార్థాలను కలిపి తినమని సూచిస్తున్నారు డాక్టర్స్.
బ్రౌన్ రైస్
బ్రౌన్ రైస్ దాదాపు వైట్ రైస్ తో సమానమేనని... కాకపోతే ఇందులో కొంచెం ఎక్కువ ఫైబర్ ఉంటుందని అంటున్నారు.
గోధుమపిండి:
గోధుమ పిండి కూడా బియ్యం లాగే, తీసుకునే పరిమాణం ముఖ్యమని అంటున్నారు.మార్కెట్లో లభించే సాధారణ పిండి కంటే అసలైన గోధుమ పిండికి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందని అంటున్నారు డాక్టర్స్.
చిరుధాన్యాలు:
చిరుధాన్యాల్లో పీచుపదార్థం, సూక్ష్మపోషకాలతో సమృద్ధిగా ఉన్నాయని అంటున్నారు. అయితే చిరుధాన్యాల్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయని అంటున్నారు. ప్రతి ధాన్యాన్ని చిరుధాన్యాలతో భర్తీ చేయడానికి బదులుగా, రాగి, జొన్న, బజ్రా వంటి వాటిని మార్చి మార్చి వాడాలని సూచిస్తున్నారు.
