ప్రధాని నరేంద్ర మోడీ బలమైన నాయకత్వంలో గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి పనులు ప్రజల్లో మోడీపట్ల విశ్వాసాన్ని మరింతగా పెంచిందన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. దేశాభివృద్ధికి కృషి చేసే నేత, పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారని ఆయన అన్నారు. బాలాకోట్లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ తమ ఎన్నికల ప్రచారాస్త్రం కాదన్నారు. 2014లో కంటే ఇప్పుడు మరింత ఎక్కువ మెజారిటీతో విజయం సాధిస్తామని రాజ్నాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు.