ఒకరి మృతదేహానికి బదులు మరో డెడ్ బాడీ

ఒకరి మృతదేహానికి బదులు మరో డెడ్ బాడీ

కరీంనగర్ జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. అసలే తమ వ్యక్తి చనిపోయిన బాధలో ఉన్న కుటుంబసభ్యులకు ఆస్పత్రి సిబ్బంది మరింత బాధను పెంచారు. తమ వ్యక్తి మృతదేహానికి బదులు మరో వ్యక్తి మృతదేహం ఇచ్చారు. ఈ ఘటన శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన జానపట్ల మచ్చయ్య (55) కరోనాతో శుక్రవారం మృతి చెందారు. అయితే ఆస్పత్రి సిబ్బంది మాత్రం అతని మృతదేహానికి బదులు మరొకరి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ విషయంపై కుటుంబసభ్యులను అడిగితే.. ఇందులో ఆస్పత్రి తప్పేమీ లేదని చెబుతున్నారు. తామే మచ్చయ్య మృతదేహం అనుకొని పొరపాటుగా మరొకరి మృతదేహం తీసుకొచ్చామని తెలిపారు. మచ్చయ్యకు భార్య, ఒక కూతురు ఉన్నారు. ఇటీవలే మచ్చయ్య తన కూతురు వివాహం జరిపించారు. కాగా.. అదే గ్రామంలో మచ్చయ్య ఉండే వాడలోనే ఇటీవల కరోనాతో అయిదుగురు మృతి చెందారు. దాంతో గ్రామప్రజలు తీవ్రభయాందోళనలో ఉన్నారు.