సెంచరీతో సూర్యకుమార్ యాదవ్ అరుదైన రికార్డు

 సెంచరీతో సూర్యకుమార్ యాదవ్ అరుదైన రికార్డు

శ్రీలంకపై అద్భుత సెంచరీ చేసిన సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక వేగంగా  1500 పరుగులు చేసిన ఆరో బ్యాట్స్మన్గా రికార్డు క్రియేట్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 43వ ఇన్నింగ్స్లో సూర్య ఈ రికార్డును సృష్టించాడు. ఈ జాబితాలో కోహ్లీ, ఫించ్ ,బాబర్ ఆజమ్, కేఎల్ రాహుల్, మహ్మద్ రిజ్వాన్‌లు ఉన్నారు. 

కోహ్లీ నెంబర్ వన్..

టీ20ల్లో అత్యధిక వేగంగా 1500 పరుగులు చేసిన జాబితాలో కోహ్లీ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీ 39 టీ20 ఇన్నింగ్స్లో  1,500 పరుగులు పూర్తి చేశాడు. ఆరోన్ ఫించ్ 39 ఇన్నింగ్స్‌ల్లో, పాకిస్థాన్‌కు చెందిన బాబర్ ఆజమ్ 39 ఇన్నింగ్స్‌ల్లో, కేఎల్ రాహుల్ 39 ఇన్నింగ్స్‌ల్లో, పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్ 42 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డును అధిగమించారు. 

రెండో భారత బ్యాట్స్‌మెన్

లంకతో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 51 బంతుల్లో 112 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.  ఏడు ఫోర్లు, తొమ్మిది సిక్సర్ల సాయంతో మూడో టీ20  సెంచరీని నమోదు చేశాడు. దీంతో టీ20ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన రెండో భారత బ్యాట్స్మన్ గా నిలిచాడు.  రోహిత్ శర్మ నాలుగు సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు.