రంజీల్లో బరిలోకి దిగనున్న సూర్యకుమార్ యాదవ్

రంజీల్లో బరిలోకి దిగనున్న సూర్యకుమార్ యాదవ్

టీమిండియా 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ రంజీల్లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. టీ20 వరల్డ్ కప్తో పాటు..న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో రాణించిన సూర్యకుమార్..బంగ్లాతో జరుగుతున్న వన్డే సిరీస్కు విశ్రాంతి తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో అతను ముంబై తరపున రంజీ ట్రోఫీలో బరిలోకి దిగే ఛాన్సుంది.  అయితే ముంబై టీమ్ మాత్రం అతని పేరును ప్రకటించలేదు. కానీ హైదరాబాద్తో జరిగే రెండో మ్యాచ్కు సూర్య కుమార్ యాదవ్ అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

ఈ సీజన్లో రంజీ ట్రోఫీ డిసెంబర్ 13న మొదలు కానుంది. తొలి మ్యాచ్లో హర్యానా, హిమాచల్ ప్రదేశ్ ఢీకొట్టుకోబోతున్నాయి. అదే రోజు ముంబై ఆంధ్రాతో తొలి మ్యాచ్ ఆడనుంది. ముంబై టీమ్కు అజింక్యా రహానె సారథ్యం వహించనున్నాడు. మరోవైపు అద్భుతమైన ప్రదర్శనతో ఫామ్‌ను కొనసాగిస్తోన్న సూర్యకుమార్‌.. ఈ ఏడాది 31 టీ20 మ్యాచ్‌ల్లో 46.56 సగటుతో 1,164 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 9 అర్ధసెంచరీలున్నాయి.