బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ డెత్ మిస్టరీ పై విచారణ కొనసాగుతుంది. సుశాంత్ మరణాన్ని దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులు..అతనికి చికిత్స చేసిన సైకియాట్రిస్టులను, సైకోథెరపిస్టుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. సుశాంత్ కు ట్రీట్మెంట్ చేసిన ముంబైకి చెందిన మహిళా సైకోథెరపిస్ట్ ను బాంద్రా పోలీస్ స్టేషన్ లో ఐదుగంటల పాటు విచారించారు. విచారణలో ఆమె స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు.
ముగ్గురి స్టేట్మెంట్, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుశాంత్ కు చెందిన టాలెంట్ మేనేజ్ మెంట్ సంస్థలో దిశా సెలైన్ విధులు నిర్వహిస్తున్నారు. ఆ సంస్థను సుశాంత్ కుటుంబసభ్యుడైన ఉదయ్ సింగ్ గౌరి నిర్వహణలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఆ సంస్థకు సంబంధించి రెండు సార్లు మాత్రమే సుంశాత్ దిషా సాలియాన్ తో భేటీ అయ్యారు.
ఇదిలా ఉండగా జూన్ 9న 14వ అంతస్తులోని ఫ్లాట్ నుండి దూకి దిశా సాలియన్ ఆత్మహత్య చేసుకుంది. దిశా మరణం విషయంలో సుశాంత్ హస్తం ఉందంటూ అనేక కథనాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు సైతం తనని విచారణ చేపట్టడంపై సుశాంత్ తీవ్ర ఒత్తిడి గురైనట్లు, డాక్టర్లు ఇచ్చిన మందులు వాడటం మానేసినట్లు సమాచారం.
గౌరీ స్టేట్మెంట్ను రికార్డు చేసిన పోలీసులు, ఎవరైనా ప్లాన్ చేసి సుశాంత్ను బెదిరించడం వల్ల మరణించాడా అనే కోణంలో కూడా దర్యాప్తు చేశారు. నెగిటివ్ స్టోరీ యాంగిల్లో కూడా విచారణ చేస్తున్నారు. చాలా మంది అగ్రశ్రేణి బాలీవుడ్ టాలెంట్ మేనేజర్లు, కాస్టింగ్ మేనేజర్లు, పలు మీడియా సంస్థలకు చెందిన న్యూస్ పోర్టల్ రిపోర్టర్లను కూడా పోలీసులు ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి మంగళవారం పోలీసులు మరికొందరు బాలీవుడ్ ప్రముఖుల వాంగ్మూలాలను కూడా నమోదు చేశారు.