
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎమర్జెన్సీ వార్డు వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న దాదాపు 36 ఏండ్ల గుర్తు తెలియని వ్యక్తిని తొలుత సెక్యూరిటీ సిబ్బంది గమనించి, హాస్పిటల్లో అడ్మిట్ చేయించారు. అయితే, సదరు వ్యక్తి ట్రీట్మెంట్ తీసుకుంటూ గురువారం మృతి చెందాడు. డెడ్బాడీని మార్చురీలో భద్రపరిచినట్లు చిలకలగూడ పోలీసులు తెలిపారు. ఫొటోలోని వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే పీఎస్ లో సంప్రదించాలని కోరారు.