
- అనుమానాస్పద స్థితిలో మృతి
- హత్య జరిగినట్టు పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు
నల్లబెల్లి, వెలుగు: అనుమానాస్పదంగా బీటెక్ స్టూడెంట్ మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. వరంగల్జిల్లా నల్లబెల్లి మండలం లెంకలపల్లికి చెందిన బోయిని నాగరాజు(22), వాగ్ధేవి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్సెకండ్ఇయర్చదువుతున్నాడు. గురువారం తన ఫ్రెండ్ ఫంక్షన్ లో పాల్గొని రూమ్కు వెళ్లాడు.
శుక్రవారం కోమట్పల్లి ఫ్లై ఓవర్బ్రిడ్జి సమీపంలో రైలు పట్టాలపై శవమై కనిపించాడు. స్థానికులు సమాచారం అందించగా రైల్వే పోలీసులు వెళ్లి మృతుడి సెల్ఫోన్ లోని నంబర్లకు కాల్చేసి కుటుంబసభ్యులకు తెలిపారు. తమ కొడుకు ఆత్మహత్య చేసుకోలేదని, ఎవరో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రికరించేందుకే రైలు పట్టాలపై పడేశారని తల్లిదండ్రులు వీరన్న, రమ అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. నాగరాజు ములుగు మండలం మల్లంపల్లికి చెందిన యువతితో ప్రేమలో పడినట్లు ఫ్రెండ్స్ చెప్పారు. దీంతో నాగరాజు మృతి అనుమానాలకు తావిస్తుంది. రైల్వే పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.