కారును ఢీకొన్న ట్రక్కు.. 13 మంది మృతి

కారును ఢీకొన్న ట్రక్కు.. 13 మంది మృతి

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమెరికా-మెక్సికన్ బార్డర్‌లో కారును ఓ ట్రక్కు ఢీకొట్టడంతో 13 మంది మృతిచెందారు. హోల్ట్ విల్లే సమీపంలోని స్టేట్ రూట్ 115లో గల నోరిష్ రోడ్ కూడలి వద్ద మంగళవారం ఉదయం 6:15 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఎనిమిది మంది ప్రయాణించే ఎస్‌యూవీలో 25 మంది ప్రయాణిస్తున్నారు. ఘటనాస్థలిలోనే 12 మంది చనిపోగా.. మరోకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్న వారిలో 15 నుంచి 53 ఏళ్ల వయసు వారున్నారు. చనిపోయిన వారిలో 10 మంది మెక్సికన్లు ఉన్నారని మెక్సికో విదేశీ సంబంధాల విభాగం ఉత్తర అమెరికా వ్యవహారాల డైరెక్టర్ రాబర్టో వెలాస్కో ధృవీకరించారు. కాలిఫోర్నియా పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కారులో చిక్కుకున్న వారిని బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.