రైల్వే స్వచ్ఛతా ర్యాంకింగ్స్
వరంగల్ 51, కాజిపేట 67
న్యూఢిల్లీ, వెలుగు: గాంధీ జయంతిని పురస్కరించుకొని కేంద్ర రైల్వే శాఖ ఇచ్చిన ర్యాకింగ్స్లో హైదరాబాద్ రైల్వే స్టేషన్ 17వ ర్యాంక్ దక్కించుకుంది. బుధవారం దేశ రాజధాని ఢిల్లీ లో కేంద్ర రైల్వే శాఖ స్వచ్ఛ రైల్వే, స్వచ్ఛ భారత్ -2019 ర్యాంక్ లను ప్రకటించింది. ఎన్ఎస్జీ కేటగిరిలో జైపూర్ మొదటి స్థానంలో నిలవగా, జోద్ పూర్ రెండో స్థానం దక్కించుకుంది. విజయవాడ రైల్వే స్టేషన్ ను ఏడో స్థానంలో నిలిచింది. తెలంగాణలోని వరంగల్ రైల్వే స్టేషన్51, రామగుండం 52, కాజీపేట 67, కాచిగూడ 69, ఖమ్మం 80, మంచిర్యాల స్టేషన్ 83వ స్థానంలో నిలిచాయి.