డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాల్లో నాణ్యత లోపం.. కాంగ్రెస్ ఆందోళన 

డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాల్లో నాణ్యత లోపం.. కాంగ్రెస్ ఆందోళన 

తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అంతా అవినీతిమయమని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు. రాజన్న సిరిసిల్ వేములవాడ పట్టణంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూంల నిర్మాణాల్లో నాణ్యత లోపించిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ ఆరోపించారు. వేములవాడ పట్టణంలో నిర్మాణంలోనే నిలిచి పోయిన డబుల్ బెడ్రూం వద్ద కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో జూన్ 4వ తేదీ ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు కాకముందే ఈ ఏడాదే దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం ఎంటని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వం రాదన్న భయంతోనే బీఆర్ఎస్ సర్కారు ఈ ఉత్సవాలు జరుపుతుందని ఆరోపిస్తున్నారు. 9 ఏళ్లైనా తెలంగాణలో మాత్రం ఎలాంటి అభివృద్ధి జరగలేదని, రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నెల రోజుల నుండి రైతులు పడి గాపులు కాస్తున్న అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శించారు. వేములవాడ పట్టణంలోని డబుల్ బెడ్రూం లబ్ధిదారులకు వెంటనే ఇళ్ల నిర్మాణాలు చేయాలని డిమాండ్ చేశారు.