కేసీఆర్ కుటుంబం కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం

కేసీఆర్ కుటుంబం కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం

రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నా.. వారి కుటుంబాలను అధికార పార్టీ నేతలు కనీసం పరామర్శ కూడా చేయలేదని టీ టీడీపీ నేత ఎల్‌.రమణ అన్నారు. ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలు, విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా నగరంలోని ఇందిరా పార్కు వద్ద నిర్వహించిన అఖిలపక్షం నిరసన దీక్షలో ఎల్‌.రమణ మాట్లాడారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కేసీఆర్‌ బాధ్యత వహించాలన్నారు. గ్లోబరీనా సంస్థ వెనుక ఎవరున్నారో వాస్తవాలు తెలియాలన్నారు. తెలంగాణలో విద్యా మాఫియా చెలరేగుతోందన్నారు. విద్యార్థులు కన్నెర్ర చేస్తే కేసీఆర్ కుటుంబం కాలగర్భంలో కలిసిపోతుందని రమణ అన్నారు.