కరోనా వ్యాప్తి చేసిన తబ్లిగీలను టెర్రరిస్టుల్లా చూడండి

కరోనా వ్యాప్తి చేసిన తబ్లిగీలను టెర్రరిస్టుల్లా చూడండి
  • బీజేపీ ఎంపీ అజయ్ నిషాద్ వివాదస్పద కామెంట్లు

ముజఫర్ ఫూర్ : తబ్లిగి జమాత్ సభ్యులే దేశవ్యాప్తంగా కరోనా వ్యాపించటానికి కారణమంటూ ముజఫర్ ఫూర్ బీజేపీ ఎంపీ అజయ్ నిషాద్ కంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. వారిని టెర్రరిస్టులను చూసినట్లు చూడలంటూ స్థానికులను కోరారు. తన నియోజకవర్గంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మదర్సాలపైన విమర్శలు గుప్పించారు. అక్కడ టైర్లకు పంక్చర్లు వేయటం ఎలా చేయాలో మాత్రమే నేర్పుతారని ఇంకా ఏమీ ఉండదంటూ ఆరోపించారు. అందువల్లే కరోనా వైరస్ ను మరింత ప్రమాదకరంగా మార్చారంటూ వ్యాఖ్యనించించారు. నిషాద్ కామెంట్లపై పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
వారి వల్లే కరోనా వ్యాప్తి
అటు కర్ణాటక బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎన్ రవి కుమార్ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. తబ్లీగ్ జమాత్, అజ్మీర్ దర్గా వద్ద కు వెళ్లిన వారి కారణంగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందిందన్నారు. తబ్లీగ్ జమాత్ సమావేశాలకు హాజరైన 1900 మంది సభ్యులు, అజ్మీర్ లోని దర్గా ఉర్సుకు హాజరైన 500 మంది దొంగల్లా రాష్ట్రంలోనికి వచ్చారని ఆరోపించారు. వారి చర్యలను మేధావులు ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక వర్గాన్ని కరోనా వ్యాప్తి కారణంగా గుర్తించవద్దని సూచించారు. ప్రభుత్వానికి, పార్టీకి ఒకే వైఖరి ఉండాల్సిన అవసరం లేదంటూ రవికుమార్ కామెంట్ చేశారు.