అమీర్ పేటలోని ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్న తలసాని

అమీర్ పేటలోని ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్న తలసాని

కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మన బస్తీ మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అమీర్ పేటలోని ప్రభుత్వ హై స్కూల్‭ను మంత్రి తలసాని దత్తత తీసుకున్నారు. ఈ మేరకు స్కూల్ ను పరిశీలించారు. అక్కడ విద్యార్థులకు అందుతున్న వసతులపై ఆయన ఆరా తీశారు.

అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులకు మంత్రి తలసాని షూష్ పంపిణీ చేశారు. పేద విద్యార్థులకు చేయూతను అందిస్తున్న దాతలను ఆయన అభినందించారు. విద్యార్థులు చక్కగా చదువుకుని.. వారి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. వారి చదువులకు ఆటంకం కలుగకుండా అవరసరమైన అన్ని రకాల వసతులను ఏర్పాటు చేస్తానని విద్యార్థులకు మంత్రి తలసాని హామీ ఇచ్చారు.