నా కొడకా పిస్కుతే పానం పోతది : రేవంత్ పై తలసాని శివాలెత్తాడు

నా కొడకా పిస్కుతే పానం పోతది : రేవంత్ పై తలసాని శివాలెత్తాడు

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు.  రేవంత్ ను వాడు వీడు అంటూ సంబోధించారు.  నా కొడకా పిస్కుతే పానం పోతదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత 40 ఏళ్లుగా  కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని, వరదలు వచ్చినప్పుడు నగరవాసులు చాలా ఇబ్బందులు పడ్డారు.. దీనికి కారణం గత ప్రభుత్వాలే కాదా అని తలసాని ప్రశ్ని్ంచారు.  బేగంపేట‌లో అత్యాధునిక వైకుంఠ‌ధామాన్ని మంత్రి కేటీఆర్ తో కలిసి ఆయన ప్రారంభించారు.  

ఆ  ఆలోచన ఏ  ఒక్క సీఎంకు రాలే

సీఎం కేసీఆర్ విజనే ఈ స్మశానవాటిక అని మంత్రి కేటీఆర్ అన్నారు.  స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి స్మశానవాటిక ను డెవెలప్ చేయాలన్న ఆలోచన ఏ  ఒక్క సీఎంకు రాలేదన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అద్భుతంగా డెవెలప్ అవుతుందన్న తలసాని, డెవలప్ మెంట్ లో భాగంగా చాలా  కార్యక్రమాలు చేస్తున్నామని వెల్లడించారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని  సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్నామని,  యువతకు అనేక ఉద్యోగాలు ఇస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమేనని తెలిపారు. 

రూ. 2  వేల పెన్షన్ ఇచ్చి ప్రతి ముసలివాళ్ల గౌరవం పెంచింది కేసీఆర్ అని తెలిపారు.   తెలంగాణలో యాదాద్రి గుడి కట్టడం,పెద్ద ఎత్తున యాగాలు సీఎం కేసీఆర్ చేశారని, మరి హైదరాబాద్ లో బీజేపీ నాయకులు ఎక్కడ అయిన గుడి కట్టరో చూపిస్తారా అని తలసాని ప్రశ్ని్ంచారు. బీజేపీ కులాల,మతాల్లో మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తు్ందని ఆరోపించారు.

పాత సెక్రటేరియట్‌ ను కూల్చి కొత్తది కడుతామంటే చాలా మంది లొల్లి పెట్టి కేసులు వేశారని మంత్రి తలసాని చెప్పారు. ఇప్పుడు  ప్రతి  ఒక్కరు  తాము సెక్రటేరియట్‌ లోకి వస్తామని అంటున్నారని అన్నారు. చూస్తే అమెరికా లో వైట్ హౌజ్.. తెలంగాణలో మన సెక్రటేరియట్‌ చూడాలని తలసాని చెప్పుకొచ్చారు.  

https://youtu.be/VApx-ddkXlk