Director Vikram: దర్శకుడు విక్రమ్ ఆకస్మిక మృతి.. బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో గుండెపోటు

Director Vikram: దర్శకుడు విక్రమ్ ఆకస్మిక మృతి.. బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో గుండెపోటు

తమిళ చిత్రనిర్మాత, దర్శకుడు విక్రమ్ సుగుమారన్ కన్నుమూశారు. నేడు సోమవారం (జూన్2న) మధురై నుండి చెన్నైకి బస్సులో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించారు.

45 సంవత్సరాల వయసులోనే విక్రమ్ చనిపోవడంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్నేహితులు, సినీ సెలబ్రెటీలు, మరియు ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ నివాళులర్పిస్తున్నారు.

#Rip dearest brother @VikramSugumara3
I’ve learnt so much from you & will always cherish every moment
Gone too soon
You will be missed #RIPVikramSugumaran pic.twitter.com/U78l3olCWI

— Shanthnu (@imKBRshanthnu) June 1, 2025

ఎలా జరిగిందంటే:

దర్శకుడు విక్రమ్.. మధురైలోని ఒక నిర్మాతకు కొత్త స్క్రిప్ట్ చెప్పి చెన్నైకి తిరిగి ప్రయాణం అయ్యాడు. విక్రమ్ రాత్రి బస్సు ఎక్కుతుండగా తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో.. అక్కడున్న వారు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ వైద్యులు అతన్ని బ్రతికించలేకపోయారు. ప్రస్తుతం విక్రమ్ పార్థివ దేహాన్ని చెన్నై రెడ్ హిల్స్‌ లోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు. ఇవాళ సాయంత్రం విక్రమ్ అంతక్రియలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు సమాచారం. 

A filmmaker who dreamed beyond frames, but left us too soon. Gone with countless stories untold. May your soul rest in peace Vikram Sugumaran sir #RIPVikramSugumaran pic.twitter.com/XujaPC0LbG

— Justin Prabhakaran (@justin_tunes) June 2, 2025

విక్రమ్ సుగుమారన్ సినీ ప్రస్థానం:

విక్రమ్ 1999-2000 మధ్య ప్రముఖ దర్శకుడు బాలు మహేంద్రకు అసిస్టెంట్‌గా తన సినీ కెరీర్ ను స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత వెట్రిమారన్ దర్శకత్వం 'పొల్లాధవన్' చిత్రంతో విక్రమ్ నటుడిగా మారాడు. ఈ మూవీలో తన నటనతో మంచి పేరు సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత శశికుమార్ 'కొడివీరన్' చిత్రంలో కనిపించాడు.

ఇక నటనతో పాటు దర్శకుడిగా రాణించాలని సిద్ధపడి 2013లో 'మధ యానైక్ కూట్టమ్' తెరకెక్కించాడు. ఈ సినిమాతో తమిళ సినీ పరిశ్రమలో దర్శకుడిగా తనదైన ముద్ర వేశాడు.

కొంతవిరామం తీసుకును విక్రమ్ 2023లో 'రావణ కొట్టం' మూవీని డైరెక్ట్ చేశాడు.ఇందులో శంతను, ఆనంది, ప్రభు మరియు ఇళవరసు వంటి పెద్ద నటులే నటించారు. అతని చివరి ప్రాజెక్ట్, తేరుమ్ పోరం అనే కొత్త సినిమాతో బిజీగా ఉన్న క్రమంలోనే, ఆయన చనిపోవడం సినీ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ​​​​​ 

Director Vikram Sugumaran passed away

- Madha Yaanai Koottam
- Raavana kottam

Associate in #Aadukalam pic.twitter.com/16ac3xepgm

— 3/48 (@IdhaanVedha) June 1, 2025