ఈ పాడు కుక్కలు.. పిల్లలను చంపుకు తింటున్నాయి.. : మైసూర్లో దారుణమైన ఘటన

ఈ పాడు కుక్కలు.. పిల్లలను చంపుకు తింటున్నాయి.. : మైసూర్లో దారుణమైన ఘటన

తమిళనాడులో దిగ్ర్భాంతికు గురయ్యే సంఘటన చోటు చేసుకుంది.  ఐదేళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి చేశాయి. స్కూల్ డ్రెస్లో ఉన్న బాలిక రోడ్డుపై వెళ్తుండగా కుక్కలు దాడి చేశాయి. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే..

తమిళనాడులోని హోసూరులో  స్కూల్‌ డ్రెస్‌లో ఉన్న బాలికపై ఓ వీధిలో నడుచుంటూ వెళ్తోంది. ఓ కుక్క బాలికపై దాడి చేసింది. ఇంతలో మరో కుక్క వచ్చి బాలిక డ్రెస్ పై దాడి చేసింది. ఆమె డ్రెస్ను నోటిపట్టి ఈడ్చుకెళ్లింది. మరో కుక్క బాలిక డ్రెస్ను నోటితో పట్టి గుంజింది. రెండు కుక్కలు బాలికను అటు ఇటు లాగాయి.  కుక్కలు దాడి చేయడంతో బాలిక పెద్ద పెద్దగా అరుస్తూ  ఏడ్చింది. దీన్ని గమనించిన ఓ వ్యక్తి..బాలిక వద్దకు వచ్చి కుక్కలను తరిమాడు.ఈ దృశ్యాలు అక్కడే ఉన్న  సీసీటీవీలో  రికార్డ్‌ అయ్యాయి. 

ALSO READ:సీతాఫలంతో పాటు ఆకులు, బెరుడుతోనూ ఎన్ని లాభాలో..

 బాధిత చిన్నారిని ఆసుపత్రికి తరలించారు.  బాలిక క్రిష్ణగిరి మున్సిపాలిటీ పరిధిలోని వాసవీ నగర్ నివాసిగా గుర్తించారు. ఆమె తల, పొట్టపై తీవ్రగాయాలు అయ్యాయని డాక్టర్లు తెలిపారు. హోసూర్ లో  గత రెండు నెలలుగా కుక్కల దాడి చేసిన  కేసులు నమోదైనట్లు తెలిసింది.ఈ ఏడాది  జూలైలో  65 ఏళ్ల వృద్ధుడిపై కుక్కలు దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాదు  జూన్‌లో హోసూరు బాలాజీ వీధిలో ఏడుగురు చిన్న పిల్లలను వీధికుక్కలు కరిచాయి.