భారత్తో వన్డే సిరీస్కు ముందు బంగ్లాదేశ్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే బౌలర్ టస్కిన్ అహ్మద్ వెన్ను నొప్పి కారణంగా ఈ వన్డే సిరీస్ నుంచి తప్పుకోగా..తాజాగా బంగ్లా కెప్టెన్ తమిమ్ ఇక్బాల్ కూడా సిరీస్ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా టీమిండియాతో వన్డే సిరీస్లో తమిమ్ ఆడటం లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
తొలి టెస్టుకు కష్టమే..
నవంబర్ 30న ట్రైనింగ్ మ్యాచ్ సందర్భంగా కెప్టెన్ తమిమ్ ఇక్బాల్ గజ్జల్లో గాయమైంది. దీంతో అతను రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యలు సూచించారు. ఈ క్రమంలోనే వన్డే సిరీస్కు తమీమ్ దూరమైనట్లు బంగ్లా క్రికెట్ బోర్డు వెల్లడించింది. అయితే డిసెంబర్ 14న జరిగే తొలి టెస్టుకు కూడా తమీమ్ అందుబాటులో ఉండటంపై సందిగ్ధం నెలకొంది. తమీమ్ ఇక్బాల్ స్థానంలో షకీబ్ ఆల్ హసన్ నాయకత్వం వహించే అవకాశం ఉంది.
డిసెంబర్ 4న తొలి వన్డే
టీమిండియాతో బంగ్లాదేశ్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా డిసెంబర్ 4న ఢాకా వేదికగా తొలి వన్డే జరగనుంది. ఆ తర్వాత భారత్తో బంగ్లాదేశ్ రెండు టెస్టుల సిరీస్లో పాల్గొంటుంది.
భారత్తో వన్డేలకు బంగ్లా టీమ్: లిట్టన్ కుమార్ దాస్, షకీబ్ అల్ హసన్, అనముల్ హక్ బిజోయ్, ముష్ఫికర్ రహీమ్, ముస్తాఫిజుర్ రహ్మాన్, అఫీఫ్ హొస్సేన్, యాసిర్ అలీ చౌదరి, మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహ్మద్, ఎబాడోత్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, జ్ముల్ హుస్సేన్ శాంటో,మహ్మదుల్లా, నూరుల్ హసన్ సోహన్