కొడంగల్ లో గెలిచి చూపించు : రోహిత్ రెడ్డి

కొడంగల్ లో గెలిచి చూపించు : రోహిత్ రెడ్డి
  •  తాండూరు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి  

వికారాబాద్, వెలుగు : టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి దమ్ముంటే కొడంగల్ లో బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై  గెలిచి చూపించాలని తాండూర్ ఎమ్మెల్యే అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి సవాల్ విసిరారు. ఆదివారం తన ఇంట్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నీచ రాజకీయాలు చేస్తూ.. టికెట్లను అమ్ముకుంటున్నాడని ఆరోపించారు. తాండూరులో తాను చేసిన అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని, రేవంత్ రెడ్డి చేసిన భూ కబ్జాలకు సిద్ధమా అని సవాల్ చేశారు.  

రూ.100 కోట్లకు అమ్ముడుపోయినట్లు కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలని ప్రజలను కోరారు. బీఆర్ఎస్ రాష్ట్ర నేత కరణం పురుషోత్తం రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, నేతలు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస చారి తదితరులుఉన్నారు.