- రెండేళ్ల కిందటి ప్రతిపాదనలను అమలుచేసేందుకు హెచ్ఎండీఏ చర్యలు
హైదరాబాద్, వెలుగు: సిటీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్న హుస్సేన్ సాగర్ నైట్ బజార్కు కేంద్రం కానుంది. రెండేళ్ల కిందట రూపొందించిన ప్రతిపాదనలను తొందరలోనే అమలుచేసేందుకు హెచ్ఎండీఏ అధికారులు రెడీ అవుతున్నారు. ఫన్ డే సండే కోసం ప్రతి ఆదివారం సాయంత్రం ట్యాంక్బండ్కు వచ్చే సందర్శకుల సంఖ్య పెరుగుతుండటంతో అక్కడ మరిన్ని సౌలతులు కల్పించేలా నైట్ బజార్ను తీసుకురానున్నారు. కరోనా ఎఫెక్ట్తో నైట్ బజార్ ప్రతిపాదనలు అప్పట్లో నిలిచిపోగా.. హెచ్ఎండీఏ వాటిని మళ్లీ పట్టాలెక్కించేందుకు చర్యలు చేపట్టింది. సంజీవయ్య పార్కు నుంచి బుద్ధ భవన్ వరకు హుస్సేన్సాగర్ వెంబడి నైట్ బజార్ను డెవలప్ చేయనున్నారు. ఇప్పటికే ఆ మార్గంలో అమ్యూజ్ మెంట్ పార్కు, ఫుడ్ కోర్టులు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే నైట్ బజార్ కూడా ఏర్పాటు చేస్తే, వీకెండ్ లో ట్యాంక్ బండ్ పైకి వచ్చే సందర్శకులను మరింత ఆకట్టుకుంటుందని అధికారులు భావిస్తున్నారు.