మహారాష్ట్ర: భూతవైద్యం పేరుతో అక్కాచెల్లెళ్లపై పలుసార్లు అత్యాచారం చేశోడో మాంత్రికుడు. ఆలస్యంగా వెలుగులోకి ఈ సంఘటన మహారాష్ట్రలోని నండూర్బర్ జిల్లాలో జరిగింది. ఓ వ్యక్తి తన కుమార్తెల ఆరోగ్యం సరిగా ఉండటంలేదని కొన్ని నెలల క్రితం స్థానికంగా ఉండే మాంత్రికుడు విష్ణు నాయక్ ను ఆశ్రయించాడు. బాలికలను పరిశీలించిన విష్ణు నాయక్ వారికి దెయ్యం పట్టిందని కొన్నాళ్లపాటు తన దగ్గర వదిలివెళ్తే దెయ్యాలను విడిపిస్తానని చెప్పాడు. దాంతో బాధితుడు తన ఇద్దరు కుమార్తెలను మాంత్రికుడు చెప్పినట్టుగానే అతని దగ్గర వదిలివెళ్లాడు.
తనతో గడిపితే దెయ్యం వదులుతుందంటూ అక్కాచెల్లెళ్లను నమ్మించాడు. ఈ క్రమంలోనే ఎన్నోసార్లు అత్యాచారం చేశాడు. మాంత్రికుడితో పాటు తన ఇద్దరు అనుచరులు కూడా బాధితులపై అత్యాచారం చేశారు. ఇటీవల వారిలో ఒక బాలిక గర్భం దాల్చడంతో.. బాలికల తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు ముగ్గురు దక్షిణ గుజరాత్లోని నౌసారి జిల్లాలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. బాలికల్లో ఒకరు మైనర్ కావడంతో నిందితులపై పోక్సో చట్టం కింద కూడా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు.