సిబ్బందికి ఎన్నికల రెమ్యునరేషన్ పెంచాలి : తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం

సిబ్బందికి ఎన్నికల రెమ్యునరేషన్ పెంచాలి : తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం
  •     ఎన్నికల కమిషన్​కు తపస్ వినతి 

హైదరాబాద్,వెలుగు: ఇటీవలి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాత్రింబవళ్లు కష్టపడిన టీచర్లకు చెల్లించిన రెమ్యునరేషన్  ఘోరంగా ఉందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఓద్నాల రాజశేఖర్, తెక్కలపల్లి పెంటయ్య అన్నారు.  రెమ్యునరేషన్  వ్యవహారంపై సమీక్ష జరపాలని కోరారు. 

ఈ మేరకు మంగళవారం ఈసీ అధికారి లింగ్యా నాయక్ ను కలిసి వినతిపత్రం అందించారు.  మున్సిపల్, కార్పొరేషన్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో సిబ్బందికి తగిన రెమ్యునరేషన్  నిర్ణయించి,  సవరించిన రేట్లను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.