- ఎన్నికల కమిషన్కు తపస్ వినతి
హైదరాబాద్,వెలుగు: ఇటీవలి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాత్రింబవళ్లు కష్టపడిన టీచర్లకు చెల్లించిన రెమ్యునరేషన్ ఘోరంగా ఉందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఓద్నాల రాజశేఖర్, తెక్కలపల్లి పెంటయ్య అన్నారు. రెమ్యునరేషన్ వ్యవహారంపై సమీక్ష జరపాలని కోరారు.
ఈ మేరకు మంగళవారం ఈసీ అధికారి లింగ్యా నాయక్ ను కలిసి వినతిపత్రం అందించారు. మున్సిపల్, కార్పొరేషన్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో సిబ్బందికి తగిన రెమ్యునరేషన్ నిర్ణయించి, సవరించిన రేట్లను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
