బ్రిటిష్ పాలకుల్లా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు

బ్రిటిష్ పాలకుల్లా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ పై  పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్. హైదరాబాద్ లో బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన..గ్యాంగ్ స్టర్ దావుద్ ఇబ్రహీంతో వ్యవహరించినట్లుగా బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేశారని అన్నారు. పోలీసులు టీఆర్ఎస్ జెండా మోస్తూ...ప్రశ్నించిన వారిపై  అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. వారు  ఖాకీ డ్రెస్ విడిచి పింక్ డ్రెస్ వేసుకోవాలన్నారు.
 
అబద్దపు కేసులతో  బండి సంజయ్ ని కేసీఆర్ ప్రభుత్వం జైల్లో పెట్టిస్తే.. కోర్టు న్యాయం చేస్తూ.. ఆయన్ను కోర్టు విడుదల చేసిందన్నారు తరుణ్ చుగ్. సర్కారు తప్పు చేసిందని హైకోర్టు ఆదేశాలతో స్పష్టమైందన్నారు. బ్రిటిష్ పాలకుల్లా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం పోరాడేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని.. అప్రజాస్వామిక ప్రభుత్వంపై పోరాటం చేస్తునే ఉంటామన్నారు తరుణ్ చుగ్.

మరిన్ని వార్తల కోసం..

బండి సంజయ్ కు హైకోర్టులో ఊరట