స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఎంపీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ వరంగల్ స్థానాన్ని గెలిపించాలని సూచించారు. ఎర్రవల్లిలోని ఫాంహౌజ్ లో కేసీఆర్ను రాజయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ను గెలుపునక కృషి చేయాలని కోరారు.
ఈ క్రమంలోనే స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. పార్టీ నేతలు, కేడర్ను సమన్వయం చేసుకోవాలని సూచించారు. కష్టపడేవారిని పార్టీ గుర్తింపు నిస్తుందని, గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకోవద్దని సూచించినట్లు తెలిసింది. కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని కడియం, దానం, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేసే వరకు పోరాటం చేస్తామని తెలిపినట్టు సమాచారం.