- ఉప్పల్లో ప్రాక్టీస్ చేసిన న్యూజిలాండ్
శంషాబాద్/ హైదరాబాద్, వెలుగు: న్యూజిలాండ్తో వన్డే సిరీస్ కోసం టీమిండియా సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకుంది. తిరువనంతపురం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి వచ్చిన క్రికెటర్లను భారీ పోలీస్ బందోబస్తు మధ్య సిటీలోని పార్క్ హయత్ హోటల్కు తరలించారు. బుధవారం ఉప్పల్ స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. మరోవైపు శనివారమే సిటీ చేరుకున్న న్యూజిలాండ్ ప్లేయర్లు ఆదివారం రెస్ట్ తీసుకున్నారు. సోమవారం సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేశారు. మెయిన్ గ్రౌండ్లో గంట పాటు వామప్, క్యాచింగ్ సెషన్ తర్వాత ఫ్లడ్ లైట్స్ వెలుతురులో రెండు గంటల పాటు నెట్ ప్రాక్టీస్లో పాల్గొన్నారు. తమ స్పిన్నర్లతో పాటు లోకల్ బౌలర్లను ఎదుర్కొంటూ బ్యాటింగ్ చేశారు. మంగళవారం ఇండియా కూడా ప్రాక్టీస్లో పాల్గొంటుంది.