రోహిత్​సేన వచ్చేసింది

రోహిత్​సేన వచ్చేసింది
  • ఉప్పల్​లో ప్రాక్టీస్​ చేసిన న్యూజిలాండ్​

శంషాబాద్/ హైదరాబాద్​, వెలుగు: న్యూజిలాండ్‌‌‌‌తో వన్డే సిరీస్‌‌‌‌ కోసం టీమిండియా సోమవారం రాత్రి హైదరాబాద్‌‌‌‌ చేరుకుంది. తిరువనంతపురం నుంచి  శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి వచ్చిన క్రికెటర్లను భారీ పోలీస్ బందోబస్తు మధ్య సిటీలోని పార్క్ హయత్ హోటల్​కు తరలించారు. బుధవారం ఉప్పల్​ స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. మరోవైపు శనివారమే సిటీ చేరుకున్న న్యూజిలాండ్​ ప్లేయర్లు ఆదివారం రెస్ట్​ తీసుకున్నారు. సోమవారం సాయంత్రం ఉప్పల్​ స్టేడియంలో  ప్రాక్టీస్​ చేశారు.  మెయిన్​ గ్రౌండ్​లో  గంట పాటు వామప్​, క్యాచింగ్​ సెషన్ తర్వాత ఫ్లడ్​ లైట్స్​ వెలుతురులో రెండు గంటల పాటు నెట్​ ప్రాక్టీస్​లో పాల్గొన్నారు. తమ స్పిన్నర్లతో పాటు లోకల్​ బౌలర్లను ఎదుర్కొంటూ బ్యాటింగ్​ చేశారు.  మంగళవారం ఇండియా కూడా ప్రాక్టీస్​లో పాల్గొంటుంది.