
ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్లో టీమిండియా రెండో విజయాన్ని సాధించింది. వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో భారత మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచింది. 119 పరుగుల టార్గెట్ను టీమిండియా 18.1 ఓవర్లలోనే ఛేధించింది.
దీప్తి అదుర్స్..
తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 118 పరుగులే చేసింది. విండీస్ ప్లేయర్లలో టేలర్ 40 బంతుల్లో 6 ఫోర్లతో 42 పరుగులు చేయగా... క్యాంబెల్ 36 బంతుల్లో 3 ఫోర్లతో 30 పరుగులు సాధించింది. చివర్లో నేషన్ 21 రన్స్ చేసి నాఔట్గా నిలిచింది. దీప్తి శర్మ 3 వికెట్లు తీయగా..,పూజా వస్ట్రాకర్, రేణుకా సింగ్ చెరో వికెట్ పడగొట్టారు.
చెలరేగిన ఘోష్..
ఆ తర్వాత 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 18.1 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి ఛేదించింది. రిచా ఘోష్ 32 బంతుల్లో 44 పరుగులతో నాటౌట్ నిలిచింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 42 బంతుల్లో 3 ఫోర్లతో 33 పరుగులు చేసింది. షఫాలీ వర్మ 28 పరుగులతో పర్వాలేదనిపించింది. విండీస్ బౌలర్లలో రామ్ హరాక్ 2 వికెట్లు తీసింది. చిన్నెల్లి హెన్రీ, మాథ్యూస్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
దీప్తి వంద వికెట్లు..
ఈ మ్యాచ్లో దీప్తి శర్మ మూడు వికెట్లు తీయడంతో టీ20ల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా దీప్తి శర్మ నిలిచింది. పూనమ్ యాదవ్ 99 వికెట్లతో రెండో స్థానంలో ఉంది. అంతేకాదు మెన్స్ , ఉమెన్స్ జట్టులో అంతర్జాతీయ టి20ల్లో లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా దీప్తి శర్మ నిలిచింది. పురుషుల జట్టులో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్గా చహల్ 91 వికెట్లతో కొనసాగుతున్నాడు.