- ఇంగ్లండ్ టెస్టులో ఆకట్టుకున్న భారత బౌలర్లు
- స్నేహ్ రాణాకు 3 వికెట్లు
- ఇంగ్లండ్ విమెన్స్ 269/6
- రాణించిన నైట్
బ్రిస్టల్: ఇంగ్లండ్తో ఏకైక టెస్టులో ఇండియా విమెన్స్ టీమ్ తొలి రోజు చివర్లో పైచేయి సాధించింది. తొలుత ఆకట్టుకోలేకపోయిన బౌలర్లు ఆఖర్లో పుంజుకున్నారు. ఐదేళ్ల తర్వాత తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతున్న స్పిన్నర్ స్నేహ్ రాణా (3/77), ఆల్రౌండర్ దీప్తి శర్మ (2/50) ఆకట్టుకొని హోమ్టీమ్ జోరుకు బ్రేకులు వేశారు. ఫలితంగా తొలి రోజు చివరకు ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 92 ఓవర్లలో 6 వికెట్లకు 269 రన్స్ చేసింది. కెప్టెన్ హెథర్ నైట్ (175 బాల్స్లో 9 ఫోర్లతో 95) కొద్దిలో సెంచరీ మిస్ చేసుకోగా.. ఓపెనర్ టామీ బ్యూమోంట్ (66) ఫిఫ్టీతో రాణించింది. ప్రస్తుతం సోఫియా డంక్లీ (12 బ్యాటింగ్), కేథరిన్బ్రంట్(7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
ఓపెనర్ల జోరు
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్కు ఓపెనర్లు లారెన్ విన్ఫీల్డ్ హిల్ (35), టామీ బ్యూమోంట్మంచి ఆరంభాన్నిచ్చారు. ఫస్ట్ వికెట్కు 69 రన్స్ జోడించిన హిల్ను వస్త్రాకర్ ఔట్ చేసింది. అయితే, వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ హెథర్ నైట్ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడింది. పేసర్లు జులన్, శిఖా బౌలింగ్లో వేగంగా రన్స్ చేసిన నైట్.. స్పిన్నర్లను కూడా వదల్లేదు. దాంతో, హోమ్టీమ్ ఫస్ట్ సెషన్లో 86/1 స్కోరు సాధించింది. లంచ్ తర్వాతా ఇంగ్లండ జోరు కొనసాగింది. ఈ దశలో స్నేహ్ బౌలింగ్లో బ్యూమెంట్ ఔటైనా.. నటాలీ సివర్ (42) కాసేపు బ్యాట్ అడ్డేసింది. నైట్కు మంచి సపోర్ట్ స్కోరు పెంచే ప్రయత్నం చేయగా.. ఇంగ్లండ్ 162/2 టీ బ్రేక్కు వెళ్లింది. ఈ క్రమంలో నైట్ 115 బాల్స్లో ఫిఫ్టీ మార్క్ అందుకుంది. మూడో వికెట్కు 90 రన్స్ జోడించిన తర్వాత ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కాస్త తడబడింది. దీప్తి శర్మ, స్నేహ్ రాణా కట్టుదిట్టమైన బౌలింగ్ చేస్తూ.. రెండో ఎండ్లో చకచకా వికెట్లు తీశారు. దీంతో 21 రన్స్ తేడాతో అమీ జోన్స్ (1), నైట్, ఎల్విస్ (5) పెవిలియన్కు చేరడంతో ఇండియా రేస్లోకి వచ్చింది. అయితే సోఫియా, బ్రంట్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు.