
ఢిల్లీలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విజయం అనంతరం భారత ఆటగాళ్లు ఢిల్లీలో సరదాగా గడిపారు. సాయంత్రం ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. భారతదేశ ప్రయాణాన్ని వివరిస్తూ.. దేశ ప్రధాన మంత్రులకు అంకితం చేసిన ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని టీమిండియా సందర్శించంది..అని క్యాప్షన్ ఇచ్చింది.
స్వాతంత్ర్య వచ్చిననాటి నుంచి భారతదేశానికి ప్రధానమంత్రులుగా సేవలంగించిన వారి జీవిత విశేషాలను వివరించేలా ఢిల్లీలోని తీన్మూర్తి మార్గ్లోని నెహ్రూ మ్యూజియంలో ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు 14 మంది జీవిత విశేషాలు.. వారు చేసిన సేవలు, సవాళ్లను ఎదుర్కొన్న తీరును ప్రధానమంత్రి సంగ్రహాలయంలో పొందుపర్చారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత ఏడాది ఏప్రిల్ లో దీన్ని జాతికి అంకితం చేశారు.