
- గంటన్నర గాలిలోనే చక్కర్లు!
- ఓపెన్ కాని హైడ్రాలిక్ వీల్స్
- బేగంపేట్, హకీంపేటలో ల్యాండింగ్కు నో పర్మిషన్
- అత్యవసరంగా ఆఫీసర్ల మీటింగ్
- ఇంధనం అయిపోయే దాక గాల్లోనే ఉండాలని సూచన
- హాఫ్వీల్పై బేగంపేట్లో సేఫ్గా దింపిన పైలట్
- 14 మంది ట్రైనీ పైలట్లు సురక్షితం
కంటోన్మెంట్, వెలుగు: ఎయిర్ఫోర్స్ శిక్షణ విమానంలో శుక్రవారం సాంకేతిక లోపం తలెత్తడంతో గంటరన్నపాటు గాలిలోనే చక్కర్లు కొట్టింది. చివరకు పైలట్సమయస్ఫూర్తి, ఉన్నతాధికారుల సూచనలతో సేఫ్గా ల్యాండ్ అయ్యింది. ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన శిక్షణ విమానం 14 మంది ట్రైనీ పైలట్లతో శుక్రవారం మధ్యాహ్నం ఎయిర్ఫోర్స్స్టేషన్ నుంచి టేకాఫ్అయ్యింది.
అయితే, ల్యాండింగ్అయ్యేప్పుడు హైడ్రాలిక్ వీల్స్ఓపెన్కాలేదు. దీన్ని గుర్తించిన పైలెట్ బేగంపేట ఎయిర్ బేస్కు సమాచారం ఇచ్చాడు. అక్కడ ల్యాండింగ్కు అనుకూలంగా లేదని చెప్పడంతో హకీంపేట ఎయిర్ బేస్కు సమాచారమిచ్చారు. అక్కడి నుంచి కూడా అదే సమాధానం రావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉన్నతాధికారులు రంగంలోకి దిగి.. పరిస్థితి సమీక్షించారు. హైడ్రాలిక్ వీల్స్ ఓపెన్ కాకుండా ల్యాండింగ్ చేస్తే విమానం క్రాష్ అయ్యే అవకాశం ఉందని, అలా జరిగితే 14 మంది ట్రైనీ పైలట్ల ప్రాణాలకు ప్రమాదమని భావించారు.
విమానంలోని ఇంధనం పూర్తయ్యేవరకు గాల్లోనే చక్కర్లు కొట్టాలని, ఎమర్జెన్సీ ల్యాండింగ్కు అవసరమయ్యే ఇంధనం మాత్రమే ఉన్నప్పుడు ల్యాండ్ చేస్తే క్రాష్అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని సూచించారు. దీంతో దాదాపు గంటన్నర సేపు విమానం బేగంపేట విమానాశ్రయం పైనే చక్కర్లు కొట్టింది. ఈ క్రమంలో విమానాన్ని బేగంపేటలో ల్యాండ్ చేయలా, లేక హకీం పేటలో ల్యాండ్ చేయాలా అనే దానిపై చర్చలు జరిపారు.
చివరికి బేగంపేట అయితే సేఫ్ అని భావించి ల్యాండింగ్కు సిద్ధమయ్యారు. ఒకవేళ ల్యాండింగ్ సమయంలో ప్రమాదం జరిగితే రక్షించడానికి ఫైరింజన్, అంబులెన్స్ లు, ఎమర్జెన్సీ సిబ్బందితో సిద్ధంగా ఉన్నారు. అధికారుల సూచనల మేరకు పైలట్విమానాన్ని హాఫ్ వీల్ మీదనే సేఫ్గా ల్యాండ్చేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. పైలట్సమయస్పూర్తి, అధికారుల పక్కా ప్లానింగ్తో 14 మంది సురక్షితంగా బయటపడ్డారు.