3 ప్లాంట్లు నిర్మించనున్న టెక్నో పెయింట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

3 ప్లాంట్లు నిర్మించనున్న  టెక్నో పెయింట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: సిటీకి చెందిన పెయింట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తయారీ కంపెనీ టెక్నో పెయింట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మరో మూడు ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని విశాఖపట్నం, చిత్తూరుతోపాటు మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కట్నీ వద్ద ఇవి రానున్నాయి. ఈ కేంద్రాల్లో డ్రై సిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పుట్టీ, టెక్స్చర్స్, ప్రైమర్స్, ఎమల్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తయారు చేస్తారు. కొత్త ప్లాంట్లను ఈ ఏడాదే ప్రారంభించాలన్నది కంపెనీ ఆలోచన. మొదటిదశలో ఒక్కొక్క ప్లాంటు వార్షిక సామర్థ్యం 30 వేల మెట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టన్నులు ఉంటుందని టెక్నో పెయింట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రమోట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్న ఫార్చూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆకూరి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి తెలిపారు. వీటి నిర్మాణానికి రూ.46 కోట్లు ఇన్వెస్ట్​ చేస్తున్నామని, లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు ఒప్పుకున్నాయని వెల్లడించారు.

కంపెనీకి ఏపీలో ఒకటి, తెలంగాణలో మూడు ప్లాంట్లు ఉండగా, వీటి వార్షిక సామర్థ్యం 2,50,000 మెట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టన్నులని చెప్పారు.  2023–-24లో దేశవ్యాప్తంగా రిటైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విస్తరించాలని టెక్నో పెయింట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్ణయించింది.   ఇందులో భాగంగా కలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీని పరిచయం చేస్తోంది. వినియోగదారుడు కోరుకున్న రంగును వెంటనే అందించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఎంఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలు మాత్రమే కలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉపయోగిస్తున్నాయని శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి తెలిపారు. సాల్వెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధారిత ఎనామెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెయింట్ల తయారీని కూడా కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించింది. ఇటలీకి చెందిన రియాల్టో కలర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భాగస్వామ్యంతో స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్స్చర్స్​ను, ఫినిషెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సైతం ఉత్పత్తి చేస్తోంది. 2022–-23లో కంపెనీ 100 శాతం వృద్ధి సాధించింది. భారత పెయింట్స్, కోటింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విలువ ఈ ఏడాది రూ.62,689 కోట్లకు చేరుతుందని అంచనా. 2023-–28 మధ్య ఏటా 7 శాతం వృద్ధి చెందుతుందని శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి ఈ సందర్భంగా వివరించారు.