రూ.300 కోట్ల కోసం మరోసారి తనిఖీలు

రూ.300 కోట్ల కోసం మరోసారి తనిఖీలు

చెన్నై రూబీ జువెల్లరీ స్కామ్ కేసులో టీనగర్ పోలీసులు మరోసారి సోదాలు చేశారు. బాధితుల నుంచి సేకరించిన రూ.300 కోట్ల కోసం సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లోని మెట్రో కాలనీలో తనిఖీలు చేశారు. ఈ కేసులో జనవరి 24న నిందితులను అదుపులోకి తీసుకున్న చెన్నై పోలీసులు..నిందితులు ఇచ్చిన సమాచారంతో దాచిపెట్టిన డబ్బుపై ఆరా తీస్తున్నారు. మూడేళ్ల క్రితం చెన్నై నుంచి మకాం మార్చిన కీలక నిందితులు.. వడ్డీ లేని రుణం పేరుతో వసూలు చేసిన మూడు వందల కోట్లు హైదరాబాద్ లో ఉంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు షెల్టర్ తీసుకున్న ఇళ్లతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు పోలీసులు.

see more news

ట్రెండింగ్.. రైతులకు మద్దతుగా పోర్న్‌స్టార్..

ఎంపీలకు వార్నింగ్ ఇచ్చిన వెంకయ్య నాయుడు