హైదరాబాద్‌లో ఘనంగా తెలంగాణ 2కే రన్‌

హైదరాబాద్‌లో ఘనంగా తెలంగాణ 2కే రన్‌

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా  పోలీస్ శాఖ అధ్వర్యంలో  తెలంగాణ రన్ నిర్వహించారు  హైదరాబాద్ సిటీ పోలీసులు. ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రన్‌ను మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌ జెండాఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్‌, హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి, క్రీడాకారులు నిఖత్‌ జరీన్‌, ఈషా సింగ్‌, గాయకులు మంగ్లీ, రామ్‌ మిర్యాల, సినీ నటి శ్రీలీల పాల్గొన్నారు. నాలుగు వేలకుపైగా రన్నర్లు ఈ రన్‌లో పార్టిసిపేట్‌ చేశారు. సింగర్స్‌ మంగ్లీ, రామ్‌లు తమ పాటలతో రన్నర్లలో హుషారు నింపారు.

దేశంలోనే నెంబర్ వన్ పోలీస్ తెలంగాణ పోలీస్ అని హోమంత్రి మహమూద్‌ అలీ అన్నారు.  దేశంలో నెంబర్ వన్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు.  దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శవంతంగా మారిందని చెప్పారు.  ఈరోజు మనం ఇలా ప్రశాంతంగా ఉన్నామంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లేనని డీజీపీ అంజనీ కుమార్ అన్నారు.  బడంగ్​పేట మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి 5 కే రన్​ని ప్రారంభించారు.