- యూనియన్ నాయకుల డిమాండ్
హైదరాబాద్, ముషీరాబాద్ వెలుగు: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతనాలు పెంచి, వారి సమస్యలు పరిష్కరించాలని యూనియన్ అధ్యక్షురాలు కె. సునీత, ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ అంగన్ వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) తలపెట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. అనుమతి లేకుండా ధర్నా చేయడానికి ఇందిరాపార్క్ వద్దకు వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని అరెస్ట్చేశారు.
దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా యూనియన్ నాయకురాలు మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్లకు రూ.18 వేల వేతనం ఇవ్వాలని, ఐసీడీఎస్కు సరిపడా నిధులు కేటాయించాలన్నారు. ఎన్ఐపీ-–2020 చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
ధర్నాను అడ్డుకోవడం దారుణం:జాన్ వెస్లీ
అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల ధర్నాను పోలీసులు అడ్డుకోవడం దారుణమని సీపీఎం నేత జాన్ వెస్లీ అన్నారు. అంగన్వాడీ కార్యకర్తల అరెస్ట్లను ఆయన ఖండించారు.
