నవంబర్ 30న ఓటుకు రెడీగా ఉండండి : తెలంగాణ ఓటర్లు 3 కోట్ల 17 లక్షలు

నవంబర్ 30న ఓటుకు రెడీగా ఉండండి : తెలంగాణ ఓటర్లు 3 కోట్ల 17 లక్షలు

తెలంగాణ ఎన్నికల నగారా మోగింది. 2023, నవంబర్ 30వ తేదీ పోలింగ్ జరగనుంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒకే దశలో ఓటింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ క్రమంలోనే తెలంగాణలో ఓటర్ల సంఖ్య ఫైనల్ వివరాలు వెల్లడింది. 

తెలంగాణ రాష్ట్రం మొత్తం ఓటర్లు 3 కోట్ల 17 లక్షల 17 వేల 389 మంది అని కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. వీళ్లందరూ నవంబర్ 30వ తేదీ పోలింగ్ లో ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చింది ఈసీ. 2023, జనవరి 5వ తేదీ తర్వాత 17 లక్షల 42 వేల 470 మంది కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. ఇది 5.8 శాతం పెరుగుదల అని స్పష్టం చేసింది. అదే విధంగా పురుష ఓటర్లు కోటి 58 లక్షల మందిగా ఉంటే..  మహిళా ఓటర్లు ఒక కోటి 58 లక్షల మంది ఉన్నారు. 

18 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఓటర్లు 8 లక్షల 11 వేల 640 మంది ఉంటే.. 6 లక్షల 10 వేల 694 ఓట్లను తొలగించారు. వీళ్లలో కొంత మంది చనిపోయారు.. మరి కొంత మంది ఓటును బదిలీ చేసుకున్నారు.. మరికొన్ని బోగస్ ఓట్లు కారణంగా తొలగించబడ్డాయని వివరించింది.