-
బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు పెట్టుకోదు
-
బీజేపీ స్టేట్చీఫ్కిషన్ రెడ్డి
హైదరాబాద్: విపక్షాలు పెట్టుకున్న ఇండియా కూటమి అప్పుడే విచ్ఛిన్నం అవుతోందని కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్చీఫ్కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో హయత్నగర్ఎస్వీ కన్వెన్షన్ లోలో శక్తి వందన్ వర్క్ షాప్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, మహిళా రుణాలు, ముద్రా యోజన లోన్లపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి కిషన్ రెడ్డి చీఫ్గెస్టుగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో అనేక స్కాంలు జరిగాయి. ఆ కుంభకోణాల వల్లే అధికారానికి దూరమైంది. కాంగ్రెస్ అవినీతిపై విసిగి పోయిన ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. మోదీని విమర్శించే ధైర్యం విపక్షాలకు లేదు. కేసీఆర్ కుటుంబం అహంకారంతో సిగ్గు లేకుండా మాట్లాడుతుంది.. దేశంలో ఏ నాయకులు కేసీఆర్ ఫ్యామిలీ మాదిరిగా మాట్లాడరు. బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు పెట్టుకోదు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో 7లక్షల కోట్ల అప్పులు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను ఎలా అమలు చేస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఫిబ్రవరి చివరి వారంలో లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే చాన్స్ఉంది’ అని తెలిపారు.