
మధిర, వెలుగు: ఖమ్మం జిల్లా బోనకల్ మండలం బోనకల్కు చెందిన గుడిమళ్ళ సాయికృష్ణ (14) ఆదివారం ఏపీలోని ఎన్టీఆర్జిల్లా పొలంపల్లి డ్యాం వద్ద సెల్ఫీ తీసుకొంటూ డ్యామ్ లో పడి చనిపోయాడు. సాయికృష్ణ ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ శ్రీ ఆదర్శ స్కూల్ లో 9 వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడం తో సరదాగా డ్యామ్కు వెళ్లి సెల్ఫీ తీసుకుంటూ అందులో పడి ప్రాణాలు కోల్పోయాడు. కేసును వత్సవాయి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.