ప్రాణం తీసిన సెల్ఫీ సరదా

ప్రాణం తీసిన సెల్ఫీ సరదా

 

మధిర, వెలుగు:  ఖమ్మం జిల్లా బోనకల్ మండలం బోనకల్​కు చెందిన గుడిమళ్ళ  సాయికృష్ణ (14) ఆదివారం ఏపీలోని ఎన్టీఆర్​జిల్లా పొలంపల్లి డ్యాం వద్ద సెల్ఫీ తీసుకొంటూ డ్యామ్ లో పడి చనిపోయాడు. సాయికృష్ణ  ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ  శ్రీ ఆదర్శ స్కూల్ లో 9 వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడం తో సరదాగా డ్యామ్​కు వెళ్లి సెల్ఫీ తీసుకుంటూ అందులో పడి ప్రాణాలు కోల్పోయాడు. కేసును వత్సవాయి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.