
తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో (జూన్ 23) ఏర్పాటు చేసిన కేబినెట్ మీటింగ్ లో పలు నిర్ణయాలు తీసుకున్నారు. రేపు (జూన్ 24) తెలంగాణ వ్యాప్తంగా రైతు భరోసా సంబరాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. అన్ని మండల కేంద్రాలలో సంబరాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. పండుగ వాతావరణంలో వేడుకలు జరపాలని నిర్ణయించినట్లు కేబినెట్ మీటింగ్ అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కేబినెట్ నిర్ణయాలపై మంత్రి చెప్పిన వివరాలు:
- 9 రోజుల్లో రూ. 9 వేల కోట్ల రైతు భరోసా ఇచ్చాం
- అందులో భాగంగా జూన్ 24న రైతు భరోసా వేడుకల నిర్వహణ
- జూన్ 24 సాయంత్రం 6 గంటలకు సచివాలయం ఎదురుగా రైతు నేస్తం సభ.
- నవంబర్ 9 లోపు తెలంగాణ తల్లి విగ్రహాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం
- అన్ని కలెక్టర్ కార్యాలయాల ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాలు
- బనకచర్లపై గత ప్రభుత్వంలో చేసిన తప్పులు మాపై రుద్దాలని చూస్తున్నారు.. దీనిపై కేబినెట్ లో చర్చించాం
- బనకచర్లపై చట్టపరంగా, న్యాయ పరంగా వెళ్తాం
- తెలంగాణకు రావాల్సిని నీటి వాటాను ఒక్క చుక్కను కూడా వదులుకోం
- ఎంత పోరాటమైనా చేయాలని కేబినెట్ తీర్మానం
- కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రివర్గ ఆమోదం ఉందా అనే అంశంపై చర్చ
- కాళేశ్వరం కమిషన్ 30 తేదీలోపు వివరాలు ప్రభుత్వాన్ని కోరింది.. అన్ని వివరాలు రాతపూర్వకంగా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది.
- జులై మొదటి వారంలో రాష్ట్రంలో ఉన్న అందరూ ప్రతినిధులతో చర్చించి ప్రజెంట్ చేయాలని నిర్ణయం
- చౌటుప్పల్-సంగారెడ్డి వరకు 201 కిలోమీటర్ల RRRకు ఆమోదం
- విభజన చట్టంలోని అంశాలుపై తెలంగాణ హై లెవల్ కమిటీతో డిస్కస్ చేయాలని కేబినెట్ నిర్ణయం..
- హుజురాబాద్లోని న్యాయ కళాశాలలో ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు ప్రారంభించాలని నిర్ణయం.
- క్రీడలకు సంబంధించిన పాలసీని ఫైనల్ చేశాం
- 2047 విజన్ పై చర్చించాం
- పరిపాలనకు సంబంధించి ప్రతి నెల రెండు సార్లు కేబినెట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం
- కేబినెట్ అంశాలను ఎంత వరకు ఇంప్లిమెంట్ చేశామని క్వార్టర్లీ రివ్యూ చేయాలని నిర్ణయం
- రెండు కొత్త మున్సిపాలిటీకి ఆమోదం
- ఇస్నాపూర్ మున్సిపాలిటీ అప్ గ్రేడ్ చేస్తూ నిర్ణయం