
జూన్ 5న తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించి కీలక అంశాలను చర్చించాలని మంత్రుల సమావేశం నిర్ణయించింది. జూన్ 1న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులతో సీఎం రేవంత్ సమావేశం అయ్యారు. దాదాపు మూడు గంటల పాటు ఇవాళ రేవంత్ మంత్రులతో సమావేశమయ్యారు.
జూన్ 2న రాష్ట అవతరణ దినోత్సవ వేడుకలపై, రెవెన్యూ సదస్సు, భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లపై,రాజీవ్ యువ వికాసంపై సమీక్షించారు. రాష్ట మంత్రులు మే 29 , 30 తేదీలలో జిల్లాలో పర్యటించిన వివరాల తుది నివేదికపై చర్చించారు.
కేబినెట్ లో రాజీవ్ యువ వికాసంపై చర్చించాలని నిర్ణయించారు.అనుకున్నదానికంటే ఎక్కువ దరఖాస్తులు రావడంతో అన్ని పరిశీలించాకే అర్హుల జాబితా రిలీజ్ చేయాలని నిర్ణయించారు.
ఉద్యోగుల సమస్యలపై నియమించిన కమిటీకి అధికారులు డిప్యూటీ సీఎం భట్టికి ఇప్పటికే నివేదిక అందించారు. దీనిపై కేబినెట్ లో చర్చించి సమస్యల పరిష్కారంపై ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.