రేపు కేబినెట్ భేటీ.. సెక్రటేరియెట్​లో సీఎం రేవంత్​ రెడ్డి అధ్యక్షతన సమావేశం

రేపు కేబినెట్ భేటీ..  సెక్రటేరియెట్​లో సీఎం రేవంత్​ రెడ్డి అధ్యక్షతన సమావేశం

హైదరాబాద్, వెలుగు:  సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 5న మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియెట్‌లో కేబినెట్ సమావేశం కానుంది. రాజీవ్ యువవికాసం, వానాకాలంలో పంటలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, ధాన్యం కొనుగోళ్లతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ ఇచ్చిన రిపోర్టుపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఇప్పటికే దీనిపై పవర్​ పాయింట్ ప్రజేంటేషన్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. 

అలాగే ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటైన ఉన్నతాధికారుల కమిటీ తన నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి అందజేసింది. ఈ నివేదికను సీఎం మంత్రులకు భట్టి విక్రమార్క ఇప్పటికే వివరించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో కేబినెట్ లో నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన రిజర్వేషన్లకు ఈ కేబినెట్​లో ఆమోదం తెలిపే అవకాశం ఉన్నది.