తెలంగాణలో పోటీ చేసే ఎంపీ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ రిలీజ్ చేసింది. ఢిల్లీలో ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరిగింది. ఇందులో తెలంగాణ నుంచి నలుగురికి అవకాశం కలిపించింది. మిగిలిన స్థానాలకు అభ్యర్థులను త్వరలోనే ప్రకటించనుంది.
Also Read:మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సర్వం సిద్దం
నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి సుగుణ కుమారి, మెదక్ నుంచి నీలం మధు, భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ పోటీ చేయనున్నట్లుగా తెలిపింది. కాగా కాంగ్రెస్ ఇంకా ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాగా ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి.