
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని గవర్నర్ రాధాకృష్ణన్ చెప్పారు. ఇక్కడి ప్రజలు మంచివారన్నారు. బోనాల ఉత్సవాల మాదిరిగా, తన సొంత రాష్ట్రమైన తమిళనాడులోనూ ఉత్సవాలు జరుగుతాయని గుర్తుచేశారు. మహారాష్ట్ర గవర్నర్గా నియమితులైన రాధాకృష్ణన్ మంగళవారం తెలంగాణ నుంచి రిలీవ్అయ్యారు. జర్నలిస్ట్అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పగుడాకులు బాలస్వామి ఆయనను కలిసి వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ఐదు నెలల పాటు తెలంగాణకు అందించిన సేవలను గుర్తుచేశారు. జార్ఖండ్, తెలంగాణ, పుదుచ్చేరి ఆచార వ్యవహారాలు ఆకట్టుకున్నాయని చెప్పారు. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై కేంద్రంగా మహారాష్ట్రకు సేవ చేసే అవకాశం కూడా లభించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. గతంలో తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ అందించిన డైరీ తన వద్ద భద్రంగా ఉందని రాధాకృష్ణన్ చెప్పడం గొప్ప అనుభూతిని కలిగించిందని బాలస్వామి తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఏడీసీలతో కలిసి గవర్నర్ను సత్కరించి, పుస్తకం అందజేసినట్లు పేర్కొన్నారు.