మటన్​, చికెన్​ పెట్టి మాయజేస్తున్రు..అలిగిరెడ్డి ప్రవీణ్​రెడ్డి

మటన్​, చికెన్​ పెట్టి  మాయజేస్తున్రు..అలిగిరెడ్డి ప్రవీణ్​రెడ్డి

హుస్నాబాద్​, వెలుగు : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో  మటన్,​ చికెన్‌ పెట్టి ప్రజలను మాయచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్​ నేత అలిగిరెడ్డి ప్రవీణ్​రెడ్డి విమర్శించారు.  ‘పల్లె పల్లెకు ప్రవీణన్న, గడప గడపకు కాంగ్రెస్’ పేరుతో ఆయన చేపట్టిన పాదయాత్ర మంగళవారం అక్కన్నపేట మండలం ధర్మారానికి చేరుకుంది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్​ ఎన్ని మాయలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు . ఓ వైపు రైతులకు  సంకెళ్లు వేస్తూ.. మరో వైపు సంబురాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎమ్మెల్యేగా ఆర్డీవో ఆఫీసు, పాలిటెక్నిక్ కాలేజీ, ఆస్పత్రి ఆధునీకరణ పనులు  మొదలుపెట్టానని గుర్తుచేశారు. ఎమ్మెల్యే సతీశ్​కుమార్ హరీశ్​రావు, కేటీఆర్​ గురించి గొప్పలు చెప్పడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు.  ఆయన వెంట టీపీసీసీ మెంబర్​ కేడం లింగమూర్తి, సొసైటీ చైర్మన్ బొలిశెట్టి శివయ్య,  నేతలు బంక చందు, ఐలయ్య,   సంజీవరెడ్డి, రాజిరెడ్డి ఉన్నారు.