జూన్ 1న ఎడ్‌‌సెట్‌‌ ప్రవేశ పరీక్ష

జూన్ 1న ఎడ్‌‌సెట్‌‌ ప్రవేశ పరీక్ష

హనుమకొండ, వెలుగు: బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఎడ్‌‌సెట్‌‌ ప్రవేశ పరీక్ష ఆదివారం జరగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. ఆన్​ లైన్​ లో నిర్వహించే పరీక్షకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని ఎడ్ సెట్ కన్వీనర్ బైరు వెంకటరామిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ ఎగ్జామ్​కు నిమిషం నిబంధన ఉందని..అభ్యర్థులు సకాలంలో సెంటర్ కు చేరుకోవాలని ఆయన సూచించారు. 1997 నుంచి 2002 వరకు కేయూ ఎడ్​సెట్​ఎగ్జామ్ కండక్ట్ చేయగా.. దాదాపు 23 ఏండ్ల తరువాత ఎడ్ సెట్ నిర్వహణ బాధ్యత  మళ్లీ కాకతీయ యూనివర్సిటీకి దక్కింది. ఈ ఎగ్జామ్ కు మొత్తంగా 38,758 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. అప్లై చేసిన వారిలో అత్యధికంగా 31,539 మంది మహిళలే ఉన్నారు. పురుషులు 7,218 మంది, ఒక ట్రాన్స్​ జెండర్​ ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 74 సెంటర్లు ఏర్పాటు చేశారు.