రాష్ట్ర సంపద ప్రజలందరికీ దక్కాలి: భట్టి విక్రమార్క

రాష్ట్ర సంపద ప్రజలందరికీ దక్కాలి: భట్టి విక్రమార్క

మాయమాటలతో అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయినా ఏం అభివృద్ధి చేయలేదని మధిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. 2023, నవంబర్ 13వ తేదీ సోమవారం భట్టి మధిరలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధనిక రాష్ట్రంతో తెలంగాణ ఇస్తే.. కేసీఆర్ కుటుంబం ప్రజల సోమ్మును దోచుకుందని మండిపడ్డారు.

ఈ ఎన్నికలు దొరలకు, నాలుగు కోట్ల తెలంగాణ -ప్రజలకు మధ్య జరుగుతున్నాయని.. పోరులో ప్రజలే గెలుస్తారని అన్నారు. బీఆర్ఎస్ అవినీతి పాలనను అంతమొందించాలంటే.. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఆయన చెప్పారు.  రాష్ట్రలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని.. రైతులకు2 లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు. ఇళ్ల స్థలాలు ఉంటే ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఈ రాష్ట్రం అందరిదని.. ఈ సంపద అందరికి దక్కాలని భట్టి విక్రమార్క అన్నారు.