LRSకు మరోసారి ప్రభుత్వం అనుమతి

LRSకు మరోసారి ప్రభుత్వం అనుమతి

ప్రభుత్వం LRS(ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్)కు సంబంధించిన మార్గదర్శకాలను  విడుదల చేసింది. స్థలాల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 15 వరకు ఆన్‌ లైన్‌ లో LRS అప్లికేషన్ పూర్తి చేయాలని సూచించింది. ఆగస్టు 26 వరకు కటాఫ్ డేట్‌ గా ప్రకటిస్తూ LRS స్కీమ్‌ ను తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. LRS రిజిస్ట్రేషన్ ఫీజును రూ. 1000గా నిర్ణయించిన ప్రభుత్వం… లే అవుట్ అప్లికేషన్ ఫీజును రూ. 10 వేలుగా ఖరారు చేసింది. 100 గజాలలోపు ప్లాటు కలిగి ఉన్న వాళ్లు రెగ్యులరైజేషన్ ఛార్జీల కింద గజానికి రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది.

100 నుంచి 300 గజాల వరకు రూ. 400గా రెగ్యులరైజేషన్ ఛార్జీలు ఖరారు చేశారు. 300 నుంచి 500 వరకు గజానికి రూ. 600 రెగ్యులరైజేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. 500 గజాల పైన ఉంటే రూ.750 వర్తించనున్నట్లు చెప్పింది. మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీలకు కూడా ఈ LRS స్కీమ్ వర్తిస్తుందని ప్రకటించింది సర్కార్.