20న తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ విందు

20న తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ విందు

రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలను నిర్వహించనుంది. దీని నిర్వహణ కోసం రూ.33 కోట్లను కేటాయించింది. ఈనెల 20న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం తరపున క్రిస్మస్ విందు నిర్వహించనున్నారు. ఈ విందుకు సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణపై మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి సమీక్షించారు.

క్రిస్మస్ పండగను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బట్టల పంపిణీ, విందు ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు చెప్పారు. క్రిస్మస్ విందుకు దాదాపు పది వేల మంది హాజరుకానున్నట్లు తెలిపారు.