
- ఎన్డీఎస్ఏ సూచనలతో డిజైన్లు, డ్రాయింగులు సిద్ధం చేయాలి
- ఈ నెల 15 లోపు టెండర్లు వేయండి నీటిపారుదల శాఖ నుంచి నోటిఫికేషన్ జారీ
కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ పునరుద్ధరణపై రాష్ట్ర ప్ర భుత్వం దృష్టి సారించింది. దీంతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారే జీల రిపేర్లనూ చేయించనుంది. ఇందుకోసం నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు డిజైన్లు, డ్రాయింగులు సిద్ధం చేసేందుకు కాంట్రాక్టు సంస్థల నుంచి దరఖాస్తు లను ఆహ్వానిస్తూ టెండర్ ప్రకటన జారీ చేసింది. 2023 అక్టోబరు 21వ తేదీన మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకు కుంగింది. సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లోనూ భారీగా సీపేజీలు బయటపడ్డాయి. ఈ రెండు బ్యారేజీలకు తా త్కాలికంగా మరమ్మతులు చేసినప్పటికీ నీటి నిల్వకు అవకాశం లేకుండా పోయింది.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల శక్తి మంత్రిత్వశాఖకు లేఖ రాయగా.. సీడబ్ల్యూసీ మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నియ మించింది. ఈ కమిటీ గత ఏడాది మే నెలలో ప్రాథమిక నివేదిక ఇచ్చింది. డిజైన్లు, నిర్మాణం, నాణ్యత, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సహా అనేక వైఫల్యాలున్నట్లు గుర్తించింది. బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడానికి వీల్లేదని, అలా చేస్తే మరింత నష్టం వాటిల్లుతుందని పేర్కొంది.
ఈ మేరకు కొన్ని డిజైన్లు, డ్రాయింగ్ లనూ సూచించింది. ఈ మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బారేజీల పునరుద్ధరణ, రెస్టోరేషన్ డిజైన్ల కోసం ప్రసిద్ధ డిజైన్ ఏజెన్సీల నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ ను ఆహ్వానించింది. సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయానికి డిజైన్ ఏజెన్సీలు తమ ప్రతి పాదనలను సీల్ చేసిన కవర్లలో అక్టోబర్ 15 మధ్యాహ్నం 3 గంటలలోపు సమర్పించాలి. అదే రోజు సాయంత్రం 5 గంటలకు జలసౌధ భవనంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఈ కవర్లు ఓపెన్ చేస్తామని తెలిపింది.
ఈ ప్రక్రియలో ఎంపికైన ఏజెన్సీలు ఎన్డీఎస్ఏ కమిటీ సూచనల మేరకు బ్యారేజీల పునరుద్ధరణ డ్రాయింగులు, డిజైన్లు సిద్ధం చేయాల్సి ఉంటుందని పేర్కొంది. పూర్తి వివరాలను నీటిపారుదల శాఖ అధికారిక వెబ్సైట్ లో ఉంచినట్టు ఆ శాఖ ఉన్నతాధికారు లు పేర్కొన్నారు.