
- భవనాల నిర్మాణానికి ఖాళీ స్థలాలను పరిశీలించిన ఉన్నతాధికారులు
పద్మారావునగర్, వెలుగు : గాంధీ మెడికల్ స్టూడెంట్ల కోసం కొత్తగా హాస్టళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భవనాల నిర్మాణానికి అవసరమైన స్థలాలను పరిశీలించేందుకు స్టేట్ మెడికల్, హెల్త్, ఫ్యామిలీ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చోంగ్తూ మంగళవారం గాంధీ మెడికల్ కాలేజీని అధికారులతో కలసి సందర్శించారు.
డీఎంఈ డా.ఎన్.వాణి, గాంధీ మెడికల్కాలేజీ ప్రిన్సిపాల్డా.కె.రమేశ్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్స్ డా.కృష్ణమోహన్, డా.రవీంద్రకుమార్, గాంధీ సూపరింటెండెంట్డాక్టర్ఎం.రాజారావుతో కలసి కాలేజీ ఆవరణలోని అకడమిక్ భవనం, ఫైర్ స్టేషన్, అలుమ్ని భవనం పక్కన ఉన్న ఖాళీ స్థలాలను పరిశీలించారు.