గాంధీ మెడికల్ స్టూడెంట్లకు కొత్త హాస్టళ్లు

గాంధీ మెడికల్ స్టూడెంట్లకు కొత్త హాస్టళ్లు
  • భవనాల నిర్మాణానికి ఖాళీ స్థలాలను పరిశీలించిన ఉన్నతాధికారులు

పద్మారావునగర్, వెలుగు : గాంధీ మెడికల్ స్టూడెంట్ల కోసం కొత్తగా హాస్టళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భవనాల నిర్మాణానికి అవసరమైన స్థలాలను పరిశీలించేందుకు స్టేట్ మెడికల్, హెల్త్, ఫ్యామిలీ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చోంగ్తూ మంగళవారం గాంధీ మెడికల్ కాలేజీని అధికారులతో కలసి సందర్శించారు.

డీఎంఈ డా.ఎన్.వాణి, గాంధీ మెడికల్​కాలేజీ ప్రిన్సిపాల్​డా.కె.రమేశ్ రెడ్డి, వైస్​ ప్రిన్సిపాల్స్​ డా.కృష్ణమోహన్, డా.రవీంద్రకుమార్, గాంధీ సూపరింటెండెంట్​డాక్టర్​ఎం.రాజారావుతో కలసి కాలేజీ ఆవరణలోని అకడమిక్​ భవనం, ఫైర్​ స్టేషన్, అలుమ్ని భవనం పక్కన ఉన్న ఖాళీ స్థలాలను పరిశీలించారు.