ఎన్నికల నేపథ్యంలో ..మరో 8 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ

ఎన్నికల నేపథ్యంలో ..మరో 8 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ

తెలంగాణలో ఐపీఎస్ ఆఫీస‌ర్లను బదిలీ కొనసాగుతోంది. జులై 19వ తేదీ బుధవారం మధ్నాహ్నం ఐదుగురు అధికారులను బదిలీ చేసిన రాష్ట్ర  ప్రభుత్వం..సాయంత్ర మరో 8 మంది అధికారులను ట్రాన్స్ ఫర్ చేసింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది.  త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టినట్టు తెలుస్తోంది. 

 

  • మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి హైదరాబాద్ అడ్మిన్ డీసీపీ గా బదిలీ..
  • మాదాపూర్ డీసీపీ గా గొనె సందీప్ రావు బదిలీ 
  • కమాండ్ కంట్రోల్ సెంటర్ టెక్నికల్ ఎస్పీగా కే. పుష్ప  
  • కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అడ్మిన్ ఎస్పీ సురేందర్ రెడ్డి బదిలీ
  • భూపాలపల్లి జిల్లా ఎస్పీగా  కరుణాకర్ బదిలీ
  • హైదరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీగా కవిత
  • హైదరాబాద్ ట్రాఫిక్ -3 డీసీపీగా ధన్నరపు శ్రీనివాస్
  •  ఏసీబీ జాయింట్ డైరెక్టర్ గా ప్రసన్న రాణి